రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా బొంతు శ్రీదేవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన డాక్టర్ ప్రమోద్ కుమార్.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరం పూర్తిగా కాంట్రిట్ జంగల్ అయింది. ఇలాంటి మహానగరంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరి మీద ఎంతో బాధ్యత ఉంది, సంతోష్ కుమార్ గారు ఎంతో బాధ్యతగా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలి అని ప్రతి ఒక్కరి చేత కనీసం మూడు మొక్కలు నాటాలి అని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని చేపట్టారు . ఇందులో అందరు బాగస్వామ్యులై, కార్యక్రమం విజయవంతం చేయాలనీ కోరారు. దీనివల్ల వాతావరణం లో వచ్చే మార్పులను సమతుల్యం చేస్తాయి . ఇంకా మన ఇంటిపరిసరాలను , ఇంటిపైన వీలుంతంగా చిన్న చిన్న మొక్కలు పెంచి ఎండా వేడిమి తగ్గించాలి.
పర్యావరణ కాలుష్యంతో ఉన్న గాలిని పీల్చడం వల్ల హుద్రోగ సమస్యలు పెరుగుతాయని, మొక్కలు నాటడం వల్ల మంచి గాలి దొరుకుతుంది, హుద్రోగసమస్యలు తగ్గించవచ్చు అని కోరారు. అయన మరో ముగ్గురికి సాయిచంద్ సినిమా యాక్టర్ , వై. రామారావు హైకోర్టు న్యాయవాది, సత్యప్రసాద్ ప్రముఖ రేడియాలజీ చీఫ్ అపోలో హాస్పిటల్ గార్లకు ఛాలెంజ్ విసిరారు.