గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటిన మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని చాలెంజ్‌గానే తీసుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మె ల్యే శంకర్‌నాయక్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ఆయన శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మొక్క నాటా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఒక మంచి కాన్సెప్ట్‌తో గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ తీసుకొచ్చారని అన్నారు. అనంతరం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ ఇంద్రసేనారెడ్డి, ఎమ్మార్వో రంజిత్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌కు చైర్మన్‌ చాలెంజ్‌ విసిరారు.