గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన కొత్తగూడెం కలెక్టర్ రాజత్ కుమార్ శైని

కొత్తగూడెం కలెక్టర్ బంగ్లా ఆవరణలో హరిత హారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజత్ కుమార్ శైని మూడు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి బీజం వేసిన రాజ్య సభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన నేపథ్యంలో నేడు కలెక్టర్ బంగ్లా ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ రజత్ కుమార్ శైని మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ఈ సందర్భంగా అభినందించారు. మొక్కలు నాటడమనే ప్రక్రియ చాలా ముఖ్యమైనదని అన్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి, మరో ముగ్గురికి మూడు మొక్కలు నాటమని ఛాలెంజ్ ఇవ్వడం దేశవ్యాప్తంగా వ్యాపించిందని అన్నారు. దీనివల్ల దేశంలో విరివిగా మొక్కలు పెరిగి, వాతావరణ సమతుల్యతను ఏర్పరుస్తాయని అన్నారు. జిల్లాలో విస్తృతంగా హరితహారం కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రేపటి తరాలకు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఛాలెంజ్ తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ తప్పక మూడు మొక్కలు నాటి మరో ముగ్గురు వ్యక్తులకు ఛాలెంజ్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా ఎస్పీ, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.