విశాఖ జిల్లా పరవాడ రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంఘటన జరగడం దురదృష్టకరమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఫార్మా, రసాయనాల పరిశ్రమల్లో నిర్వాహకులు భద్రత ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో 7 స్టార్ హోటళ్లను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.ఈ నెలాఖరులోగా పర్యాటక శాఖ హోటళ్లలో మరమ్మత్తులు పూర్తి చేస్తామని అన్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖ నెలకు రూ.10కోట్లు వస్తుందని మంత్రి వెల్లడించారు.
ఈ సంఘటపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరతి విచారం వ్యక్తం చేశారు. సంఘటనకు గల కారణాలను ఆమె అధికారులను అడిగా తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు.