గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన కృష్ణుడు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన బర్త్ డే సందర్భంగా సంతోష్ కుమార్ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో కృష్ణుడు. ఈ ఛాలెంజ్ సంతోష్ కుమార్ గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ సందర్భంగా.., నటులు.. అజేయ్, హీరో తనీష్,  వినాయకుడు హీరోయిన్ సోనియా కు ఛాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్  ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.