గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో స్నేహా రెడ్డి

తెలంగాణలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి ఈ చాలెంజ్‌లో పాలుపంచుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె.. నేడు పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అయాన్‌, అర్హలు మొక్కలకు నీళ్లు పోశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ చాలెంజ్‌కు తనను నామినేట్‌ చేసినందుకు సుష్మితకు థ్యాంక్స్‌ చెప్పారు. తదుపరి ఈ చాలెంజ్‌కు తన భర్త అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరిని నామినేట్‌ చేశారు