సీనియర్ నటుడు, రచయిత, రంగస్థల కళాకారుడు రావి కొండలరావు మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అప్పట్లో కొండలరావు అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండేవారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్ధించారు.
ఇదిలా ఉండగా కొండలరావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన సినీ రచయితగానే కాకుండా నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.