దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమంలా కొనసాగుతున్న ఎంపీ సంతోష్ కుమార్ హరిత సవాల్

హర హైతో భర హై ఉద్యమంలో తాము సైతం అంటూ జాతీయ దినపత్రికల ఫొటో జర్నలిస్టులు
హర హైతో భర హై ఉద్యమంలో తాము సైతం అంటూ జాతీయ దినపత్రికల ఫొటో జర్నలిస్టులు ముందుకు వచ్చారు. ఈ మేరకు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పంజాబ్ కేసరి పత్రిక మిహిర్ సింగ్, నవోదయ టైమ్స్ పత్రిక నీరజ్ కుమార్, దైనిక్ భాస్కర్ పత్రిక విజయ్ కుమార్, స్టేట్స్ మెన్ పత్రిక దీపక్ రాజ్ పాల్ తో పాటు మరికొన్ని దినపత్రికల ఫోటో జర్నలిస్టులందరు కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. హరిత మహా యజ్ఞంలో తాము సైతం భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణ హితం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.