గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జన్మదినం పురస్కరించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు . దానిని స్వీకరించి సైదిరెడ్డి ఎమ్మెల్యే ఈ రోజు తన ఇంటి గార్డెన్ లో మొక్క నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడు దేశమంతా వ్యాపించింది, తెలంగాణ హరిత హారానికి ఒక దిక్సూచి అయిందని, సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, ఇలా ప్రతి ఒక్కరు భాగస్వామ్య కావడానికి సంతోష్ కుమార్ కృషి అభినందనీయం అని, తన నియోజకవర్గం లో ప్రతి ఒక్కరి చేత మూడు మూడు మొక్కలు నాటే విదంగా కృషి చేస్తున్న అని తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నాకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అని చెప్పారు.