తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,092 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 586 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 73,050కి చేరాయి. వైరస్ ప్రభావంతో 13 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 589కి చేరింది. ప్రస్తుతం 20,358 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, 52,103 మంది వైరస్ నుంచి కోలుకు డిశ్చారి అయ్యారు. అలాగే 13,793 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,43,489 పరీక్షలు చేయగా, నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.
