ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఏడవెల్లి క్రిష్ణారెడ్డి

గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ అయాచితం శ్రీధర్ జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులకు విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి ఏడవెల్లి క్రిష్ణారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు, జనగామ నా స్వంత వ్యవసాయ భూమిలో కొబ్బరి, మామిడి, సపోటా చెట్లను నాటడం జరిగింది.. ఈ ఛాలెంజ్ ని రాష్ట్ర కార్యదర్శులు చాడ కిషన్ రెడ్డి (నల్గొండ జిల్లా), మెట్టు శ్రీనివాస్ (వరంగల్ జిల్లా), ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కమర్తం మురళి గారులను స్వీకరించాలని కోరుతున్నాను. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. గ్రీన్ ఛాలెంజ్ ను చేపట్టిన శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యావాదాలు తెలుపుతున్నాను.