ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 16,003కి చేరింది. గత 24గంటల్లో 86 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 2,906కు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 86,725 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొని 2 లక్షల 26వేల 372కు పెరిగింది. ఏపీలో కోవిడ్-19 టెస్టులు 30లక్షలు దాటాయి. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 8,061 మంది డిశ్చార్జ్ అయ్యారు.