ఆగ‌స్టు 24 నుంచి దోస్త్ అడ్మిష‌న్లు

తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం రాష్ర్ట ఉన్న‌త విద్యా మండలి గురువారం దోస్త్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియ‌కు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ర్టేష‌న్ చేసుకున్న విద్యార్థులు.. ఆగ‌స్టు 29 నుంచి సెప్టెంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మొద‌టి విడుత అడ్మిష‌న్ల‌కు సంబంధించి సీట్ల కేటాయింపు సెప్టెంబ‌ర్ 16న ఉంటుంది. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 17 నుంచి 22వ తేదీ మ‌ధ్య‌లో ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టు ఇవ్వాలి.