తెలంగాణ‌లో ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖ‌రారు

తెలంగాణ‌లో వివిధ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖ‌రార‌య్యింది. రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఖ‌రారు చేసింది. గ‌తంలోనే తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసిన‌ప్ప‌టికీ క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ కార‌ణంగా షెడ్యూల్ ప్ర‌కారం ప‌రీక్ష‌లు జ‌రుగ‌లేదు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ ఉన్న‌త‌విద్యామండ‌లి తాజాగా నూత‌న షెడ్యూల్‌ను ఖ‌రారు చేసి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్ధమైంది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. 

తాజా షెడ్యూల్ ప్ర‌కారం.. ఆగ‌స్టు 31న టీఎస్ ఈసెట్‌ ప‌రీక్ష జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌ర్ 9 నుంచి 14 వ‌ర‌కు ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇక సెప్టెంబ‌ర్ 21 నుంచి 24 వ‌ర‌కు పీజీ ఈసెట్‌, సెప్టెంబ‌ర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. సెప్టెంబ‌ర్ 30, అక్టోబ‌ర్ 1న టీఎస్ ఐసెట్‌, అక్టోబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు ఎడ్‌సెట్‌, అక్టోబ‌ర్ 4న లాసెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈ మేర‌కు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న చేసింది.