తెలంగాణలో వివిధ ప్రవేశపరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రవేశపరీక్షల షెడ్యూల్ను ఖరారు చేసింది. గతంలోనే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రవేశపరీక్షల షెడ్యూల్ను ఖరారు చేసినప్పటికీ కరోనా వైరస్ విస్తరణ కారణంగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నతవిద్యామండలి తాజాగా నూతన షెడ్యూల్ను ఖరారు చేసి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
తాజా షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 31న టీఎస్ ఈసెట్ పరీక్ష జరుగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్, సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు జరుగుతాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్, అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఎడ్సెట్, అక్టోబర్ 4న లాసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ఒక ప్రకటన చేసింది.