కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగుతున్నది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో గేట్లు ఎత్తడంతో నీరంతా సముద్రం పాలవుతోంది. నాగార్జున సాగర్కు 4లక్షల క్యూసెక్కులు దాటిపోయింది. డ్యామ్కు ప్రస్తుతం 4,49,433 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తండగా.. అధికారులు 20 గేట్లు ఎత్తి వేసి, దిగువకు 4,49,433 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రస్తుతం నీటి నిల్వ 306.3966 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 588.20 అడుగులకు చేరిందని అధికారులు పేర్కొంటున్నారు. సాగర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండడంతో.. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
