తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 1580 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 87,675కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో నిన్న కొత్తగా 2,932 మందికి కారోనా వైరస్ సోకింది. దీంతో కరోనా బాధితులు 1,17,415కి చేరారు. ఇందులో 28,941 కేసులు యాక్టివ్గా ఉండగా, అందులో 22,097 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కరోనా వైరస్ వల్ల నిన్న కొత్తగా 11 మంది మరణించారు. దీంతో కరోనా మృతులు 799కి పెరిగారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 520 కేసులు నమోదవగా, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 218 చొప్పున నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 168, నల్లగొండలో 159, ఖమ్మంలో 141, నిజామాబాద్ 129, జగిత్యాలలో 113, మంచిర్యాలలో 110, సూర్యాపేట 102, సిద్దిపేటలో 100, భద్రాద్రి కొత్తగూడెంలో 89, వరంగల్ అర్బన్ 80, మహబూబాబాద్లో 76, మహబూబ్నగర్లో 67, సిరిసిల్ల జిల్లాలో 64, పెద్దపల్లిలో 60, వనపర్తి 51, కామారెడ్డి 51, సంగారెడ్డి 49, జోగులాంబ గద్వాల 46, నాగర్కర్నూల్లో 42, యాదాద్రి భువనగిరిలో 42, జనగామ 38, వరంగల్ రూరల్లో 34, నిర్మల్లో 32, ఆదిలాబాద్ 25, మెదక్ 24, వికారాబాద్ 22, ములుగు 18, నారాయణపేటలో 16, ఆసిఫాబాద్ జిల్లాలో 15, జయశంకర్ భూపాలపల్లి 13 చొప్పున ఉన్నాయి.