గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కు చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 827కి చేరింది. తాజాగా 1,849 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 92,837 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్ కేసులు ఉండగా, 24,216 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 0.66శాతం మరణాల రేటు ఉండగా, దేశంలో 1.78శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 73.3శాతంగా ఉందని చెప్పింది. తాజాగా ఆదివారం ఒకే రోజు 37,791 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 13,65,582 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది. 800 శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 36,782 మందికి టెస్టులు చేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్ఎంసీలో 360 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. తర్వాత అత్యధికంగా 180, రంగారెడ్డి 129, ఖమ్మం 103, నిజామాబాద్ 94, వరంగల్ అర్బన్ 94 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.