ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,392 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 72 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 4,125కు చేరింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 4,55,531కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,076 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 8,454 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 38,43,550 శాంపిల్స్ను పరీక్షించారు.