తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో ప్రధాన నిందితురాలుగా ఉన్న సంస్థ మాజీ డైరెక్టర్ దేవికారాణి మరోసారి అరెస్టయ్యారు. శుక్రవారం దేవికారాణి, కంచర్ల శ్రీహరి బాబు అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. తాజాగా ఈ స్కామ్లో ఏసీబీ అధికారులు 6.5 కోట్ల రూపాయల అవినీతిని గుర్తించారు.
కాగా, దేవికారాణిని మొదటిసారి అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్ల ఉందంటున్న ఏసీబీ భావిస్తోంది. దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసింది. ఒక పక్క విచారణ కోనసాగుతుండగానే నిందితులు తమ ఆస్తులను, బంగారపు ఆభరణాలను పక్కా ప్లాన్తో దారి మళ్లించినట్లు ఏసీబీ భావిస్తోంది.