స్వ‌ల్పంగా త‌గ్గిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. రోజువారీ స‌మీక్షలో భాగంగా దేశీయ చ‌మురు కంపెనీలు పెట్రో ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌ రాజ‌ధాని న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్‌పై 13 పైస‌లు, డీజిల్‌పై 12 పైస‌ల చొప్పున తగ్గాయి. ఈ నేప‌థ్యంలో లీట‌ర్ పెట్రోల్ ద‌ర రూ.81.86గా, డీజిల్ ధ‌ర రూ.72.93గా ఉన్నాయి. 

కాగా పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు ఒక్కోవిధ‌మైన ప‌న్నులు వ‌సూలు చేస్తున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండ‌నున్నాయి.