ఏపీలో కొత్తగా 7,553 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజుల నుంచి కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7553 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 51 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 639302కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 71,465 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇప్పటి వరకు 562376కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5461కు పెరిగింది. 24 గంటల్లో 10,555 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 52,29,529 శాంపిల్స్‌ పరీక్షించారు.