ఎస్పీ బాలు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు కేసీఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. బాలు లేని లోటు ఎప్ప‌టికీ పూడ్చ‌లేనిది అని పేర్కొన్నారు. ఎన్నో సుమ‌ధుర గేయాలు పాడి ప్ర‌జ‌ల అభిమానం సంపాదించారు అని గుర్తు చేశారు. గాయ‌కుడిగా, న‌టుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా సేవ‌లు అందించార‌ని సీఎం పేర్కొన్నారు.