భారత దినపత్రికల సంఘం‌ అధ్యక్షుడిగా ఆదిమూలం

భారత దినపత్రికల సంఘం (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా ఎల్‌ ఆదిమూలం ఎన్నికయ్యారు. బెంగళూరులో శుక్రవారం జరిగిన 81వ ఐఎన్‌ఎస్‌ వార్షిక సమావేశంలో ‘హెల్త్‌ అండ్‌ యాంటిసెప్టిక్‌ పబ్లికేషన్స్‌’ అధినేత ఆదిమూలంను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా డీడీ పుర్కాయస్త (ఆనందబజార్‌) ఎన్నికయ్యారు.