నోముల నర్సింహయ్య కుటుంబానికి కుందూరు జానారెడ్డి పరామర్శ

ఇటీవల మృతిచెందిన నాగార్జున సాగర్‌ టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య కుటుంబాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ పరామర్శించారు. ఛాతినొప్పి అని చెప్పడంతో నోముల నర్సింహయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఈ నెల 1వ తేదీన నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తెల్లవారుజామున 5.30కి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు.