తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ప్రార్థించారు. 2020లో కరోనాతో అనేక కష్టాలు పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త ఏడాది వ్యాక్సినేషన్‌తో కరోనా అంతం కావాలని ఆకాంక్షించారు.