టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఎంపీ నామా నాగేశ్వరరావును ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసుకు సంబంధించిన ఈడీ నామాకు సమన్లు జారీ చేసింది. మధుకాన్‌ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. మధుకాన్‌ గ్రూప్‌ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల ఈడీ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. సోదాల్లో హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు, రూ.లక్షల నగదు స్వాధీనం చేసుకుంది.