మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్పై వెళ్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఐకియా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్కు తీవ్రగాయాలయ్యాయి. కుడి కన్ను పైన, ఛాతి, పొట్ట భాగంలో గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని మెగా హీరోను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.