మంచిర్యాల జిల్లా చెన్నూర్ కు చెందిన పలువురు టీఆర్ఎస్ లీడర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ తమ ఉపాధిని దెబ్బ తీస్తున్నారంటూ టౌన్లోని ట్రాక్టర్ల ఓనర్లు శనివారం ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాంప్ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. ట్రాక్టర్ ఓనర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నూకల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ నామని మహేష్, కార్యదర్శి పిల్లలమర్రి అంజయ్య మాట్లాడుతూ మైనింగ్డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అక్కెపల్లి బతుకమ్మ వాగులో లోకల్యూజ్ కోసం ఇసుక రీచ్ఏర్పాటు చేశారని చెప్పారు. టౌన్లో ఉన్న నలభై ట్రాక్టర్లకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని ఇసుక రవాణా చేస్తున్నామని అన్నారు. కానీ మండలానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి రూలింగ్పార్టీ లీడర్లు, ఆఫీసర్ల అండతో సుబ్బరాంపల్లి, వెంకంపేట బతుకమ్మ వాగులో జేసీబీ పెట్టి రాత్రిళ్లు పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడని ఆరోపించారు. చెన్నూర్లో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు దొంగచాటుగా సప్లై చేయడం వల్ల తమకు బుకింగ్స్ తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ఆ ఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా అక్రమ రవాణా అరికట్టడం లేదని వాపోయారు. చెన్నూర్ ఎమ్మెల్యే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు దగ్గర నిలిపిన ట్రాక్టర్లను పోలీసులు అక్కడినుంచి తీయించారు.